LIVE FM सुनें

ADS 2020

LIVE CALANDER

December 2022
M T W T F S S
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
8th December 2022

Anantapur Live News

www.anantapurlivenews.com

క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేయండి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు

1 min read

ఈ నెల 21వ తేదీన నమోదు కార్యక్రమం ప్రారంభం
జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమాన్ని ఈ నెల 21 నుంచి ప్రారంభిస్తున్నాం. అని తెలిపారు

ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క జనసేన నాయకుడు, జన సైనికులు, వీరమహిళలు పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. 2020 సంవత్సరం సెప్టెంబర్ నెలలో క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమాన్ని ప్రారంభించాం. దాదాపు లక్షమందికి పైచిలుకు క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు

క్షేత్రస్థాయిలో గమనించాను. పార్టీ కోసం ఎంతో కష్టపడి.. అభిమానంతో పని చేసేవారు ముఖ్యంగా యువత ప్రమాదాలకు గురై ఇబ్బందులు పడటం నా దృష్టి వచ్చింది. అలాగే కొంతమంది జన సైనికులు ప్రమాదవశాత్తు మరణిస్తున్నారు. ప్రమాదానికి గురైనవారికి, మరణించిన వారి కుటుంబాలకు జనసేన నాయకులు వ్యక్తిగతంగా సహాయం అందించారు.

ఇవన్ని చూసి జన సైనికులకు ఏదైనా చేయాలన్న తపనతో పార్టీలోని సీనియర్ నాయకులు, కార్యవర్గంతో మాట్లాడి బీమా పథకాన్ని తీసుకొచ్చాం. అన్నారు