Anantapur Live News

www.anantapurlivenews.com

ప్రజలలో నాడు ,ప్రజల కోసం నేడు అంటూ కాపు రామచంద్ర రెడ్డి ( ఎమ్మెల్యే& ప్రభుత్వ విప్) పాదయాత్ర,

1 min read

అనంతపూర్ లైవ్ న్యూస్,
నవంబర్:- 08

బొమ్మనహల్:- మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామం నుండి పాదయాత్ర ప్రారంభించి హోన్నాల్లి, దర్గా హోన్నూర్, గోవిందవాడ గ్రామం వరకు కాపు రామచంద్ర రెడ్డి పాదయాత్ర చేశారు ఈ పాదయాత్రలో బొమ్మనహల్ మండలం లోని అన్ని గ్రామాల నుండి వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి గారు నాడు ప్రజలలో ఇచ్చినటువంటి హామీలు ఏవి తక్కువ కాకుండా అన్ని పథకాలు నెరవేరుస్తూ వస్తూనే ఉన్నారు, అమ్మ ఒడి అయితే నేమి, స్కూల్లో చదువుకున్న టువంటి పిల్లలకు కార్పొరేట్ స్కూల్లో చదువుతున్న టువంటి వారికి తక్కువ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో పేద పిల్లల కోసం చాలా చేశారు, అదేవిధంగా మహిళా సంఘాలకు అయితే వైఎస్ఆర్ ఆసరా, చిన్న కార్ వ్యాపారస్తులకు వైయస్సార్ చేయూత, ఇంకా కులాల వారీగా అన్ని వర్గాలకు కార్పొరేషన్ల ద్వారా లబ్ధి పొందారు, ఇంకా చెప్పుకుంటూ పోతే రోజుకో పథకం పెడుతూ పేదవారు అనేది మన రాష్ట్రంలో లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్రాన్ని ఒక బాటలో నడుపుతున్నారు. మరి నాడు ప్రజలలో లో మన జగన్ మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రజల్లో ఏమి కష్టాలు ఉన్నాయి తెలుసుకుని నేడు ప్రజలలో మనం చేస్తున్నటువంటి పథకాలలో ప్రజలకు చేరుతున్న లేదా తెలుసుకోవడానికి నాడు ప్రజలలో, నేడు ప్రజల కోసం అంటూ మన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజల సమస్య తెలుసుకోవడానికే ఈ పాదయాత్ర అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో బొమ్మనహల్ మండల కన్వీనర్ ఈశ్వర్ రెడ్డి, గోవింద్ వాడ వై. ఎస్ .ఆర్. సి పి నాయకుడు ఎల్. లోకేష్, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

लाइव कैलेंडर

November 2020
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

LIVE FM सुनें

ADS 2020