LIVE FM सुनें

ADS 2020

LIVE CALANDER

December 2022
M T W T F S S
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
8th December 2022

Anantapur Live News

www.anantapurlivenews.com

ఎంపీ మాధవ్ పై కుట్రలు చేస్తే ఖబడ్దార్

1 min read

బిసి, ప్రజాసంఘాల హెచ్చరిక

కర్నూలు:- బహుజన వర్గానికి చెందిన నాయకుడు, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పై కుట్రలు చేస్తే సహించేది లేదని ఖబడ్దార్ అని బిసి, ప్రజాసంఘాల నాయకులు హెచ్చరించారు కర్నూలు నగరంలోని స్థానిక బిసి భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజా పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు బలరాం, బిసి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకులు బత్తుల లక్ష్మీకాంతయ్య, జిల్లా కురువ సంఘం అధ్యక్షులు శ్రీనివాసరావు,రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్, మాదాసి మాదారి కురువ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సుంకన్న, బిసి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవపూజ ధనుంజయ ఆచారి, బిసీ చైతన్య వేదిక మహిళా అధ్యక్షురాలు రమిజాబీ లు మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పై మార్ఫింగ్ వీడియోతో అసభ్యప్రసారాలు,తప్పుడు ప్రచారాలు చేస్తున్న వ్యక్తులు,పార్టీల అంతుచూస్తామని అది బహుజనలపైన జరుగుతున్న కుట్రగా భావిస్తున్నామని బిసీలంతా ఏకమై మీకు తగిన బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు.
ఇదే కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఆ వీడియో మార్ఫింగ్ దని అది నిజమని రుజువుచేయగలిగితే తలనరుక్కుంటానని గోరంట్ల మాధవ్ బహిరంగ సవాల్ విసిరిన వాస్తాఅవాస్తవాలు తెలుసుకోకుండా టిడిపి కర్నూలు జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితర తెలుగుదేశం నాయకులు బిసి నాయకుడు,హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ దిష్టిబొమ్మను దహనం చేయడం బిసిలందరిని అవమానించడమేనని అలాంటి వారికి బిసిలంతా కలిసి తగిన బుద్ధిచెబుతామని, రాజకీయ సమాధి కడతామని హెచ్చరించారు ఇప్పటికైనా ఇలాంటి దుష్ర్పచారాలు మానివేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో వాల్మీకి శ్రీనివాసులు,కృష్ణోజిరావు, బత్తిన కిరణ్ కుమార్,చిన్నటేకూరు పెద్ద ఈశ్వరయ్య, హేమంత్ గౌడ్, శశికుమార్, భరత్ కుమార్,సుమంత్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.

MALL