LIVE FM सुनें

ADS 2020

LIVE CALANDER

September 2022
M T W T F S S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
2nd September 2022

Anantapur Live News

www.anantapurlivenews.com

అమరావతి పార్టీ కేంద్ర కార్యాలయం లో Nara Chandrababu Naidu గారి అధ్యక్షతన జరిగిన టీడీపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం లో సహచర పార్టీ నాయకులతో వైకుంఠం ప్రభాకర్ చౌదరి కలసి పాల్గొనడం జరిగింది.

1 min read

అమరావతి పార్టీ కేంద్ర కార్యాలయం లో Nara Chandrababu Naidu గారి అధ్యక్షతన జరిగిన టీడీపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం లో సహచర పార్టీ నాయకులతో వైకుంఠం ప్రభాకర్ చౌదరి కలసి పాల్గొనడం జరిగింది.

మంగళగిరి: నేడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న టిడిపి రాష్ట్ర కమిటీ సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ప్రారంభోపన్యాసం లోని ముఖ్యాంశాలు.
రాష్ట్రంలో సంక్షేమం అనేది మొదట పరిచయం చేసింది ఎన్టీఆర్. ఆహార భద్రతకు నాంది పలికింది ఎన్టీఆర్.
• పేద పిల్లల కోసం గురుకుల పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టింది ఎన్టీఆర్
• పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టింది ఎన్టీఆర్. పాలనలో సంస్కరణలు మొదలు పెట్టింది ఎన్టీఆర్.
• తెలుగు దేశం జాతీయ భావాలు ఉన్న ప్రాంతీయ పార్టీ. టిడిపి గత విజయాలు నెమరవేసుకోవాలి. ప్రజలకు గుర్తు చెయ్యాలి.
• ఆత్మగౌరవంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా అవసరం నాడు చాటి చెప్పాం.
• నేటి రాష్ట్రం లో పరిస్థితి చూస్తున్నాం….పాలకుడికి ఉండాల్సింది విజన్ కానీ విద్వేషం కాదు.
• నేడు ఎక్కడ చూసినా విద్వేషమే….పాలకుల విజన్ పోయి పాయిజన్ గా తయారయ్యింది.
• తమకు రావాల్సిన బకాయిలపై అనంతపురంలో కానిస్టేబుల్ ప్ల కార్డు పట్టుకున్నాడు.
• దీంతో ఆయనను టార్గెట్ చేశారు….ఉద్యోగం నుంచి తొలగించారు.
• కానిస్టేబుల్ తనను వేధించలేదు అని చెప్పిన శ్రీలక్ష్మిని వేధిస్తున్నారు.
• కానిస్టేబుల్ ప్రకాష్ ఇప్పుడు కనపడడం లేదు.
• సమస్యల ను ప్రస్తావిస్తే..దాడులు, విధింపులకు పాల్పడుతున్నారు.
• నాడు విజన్ తో చేసిన పాలనతో ఇప్పుడు హైదరాబాద్ మంచి స్థానంలో ఉంది.
• ప్రపంచంలో తెలుగు జాతి ఉన్నతి స్థితిలో ఉండడమే నాకు అన్నిటికంటే సంతృప్తి
• 27 ఏళ్ల క్రితం మనం చేసిన పనులు..ఇప్పుడు ఫలితాలను ఇస్తున్నాయి.
• విభజన వల్ల నష్టం జరిగింది…అయినా నాడు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాం.
• 200 పెన్షన్ 2000 చేశాం….ఉద్యోగులకు 42 శాతం ఫిట్మెంట్ ఇచ్చాం.
• జగన్ ఇప్పుడు ఒక్కో కుటుంబం పై మూడేళ్లలో 3.25 లక్షల రుణ భారం వేశారు.
• దేశంలో ఎక్కువ పెట్రో ధరలు ఉండే రాష్ట్రం ఏపీనే
• వృత్తి పన్ను, ఆస్థిపన్ను, చెత్త పన్ను అని ఇష్టం వచ్చినట్లు పన్నులు వేశారు.
• టిడిపి పెట్టిన అన్న క్యాంటీన్ రద్దు చేశారు…ఇప్పుడు అన్నదానం చేస్తున్న వారిపైనా దాడులు చేస్తున్నారు.
• నాడు డొక్కా సీతమ్మ అన్నదానం చేశారు…అన్నదానానికి ఆమే స్ఫూర్తి.
• నందిగామలో చివరికి కోర్టుకు వెళ్లి అన్న క్యాంటీన్ నిర్వహణకు అనుమతులు తెచ్చుకున్నాం.
• రాష్ట్రంలో అటు పన్నుల భారం…ఇటు అప్పుల భారం.
• ఎస్సీలకు ఉన్న 26 పథకాలు రద్దు చేశారు. సబ్ ప్లాన్ తీసేశారు.
• చింతూరులో వరదల సమయంలో సిఎం జగన్ పిలిచి మాట్లాడిన బాలిక డెంగ్యూ వచ్చి చనిపోయింది.
• దీనికి సిఎం ఏం సమాధానం చెపుతారు….ఇది ప్రభుత్వ హత్య కాదా.
• వరద ప్రాంతం లో దోమల నివారణకు ఎందుకు చర్యలు తీసుకోలేదు.
• విదేశీ విద్యను ఆపేశారు….బిసిలకు ఒక్క పథకం లేదు.
• కాపు కార్పొరేషన్ కు నిధులు లేవు.
• రాష్ట్రంలో ఒక్క రైతు కూడా సంతోషంగా లేరు.
• కనీసం ధాన్యం డబ్బులు కూడా చెల్లించడం లేదు. దీంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
• రాష్ట్రంలో ఇసుక దొరక్క…భవన నిర్మాణ కార్మికులు అంతా రోడ్డున పడ్డారు.
• చేనేత, గీత, మత్స్య కారులు, ఆటో డ్రైవర్లు…ఇలా అన్నీ వర్గాలు జగన్ పాలనలో దెబ్బతిన్నారు.
• పక్క రాష్ట్రం నుంచి మద్యం తెచ్చేవారికి నో చెక్ పోస్ట్…గంజాయి తెచ్చే వారికి చెక్ పోస్ట్ లేదు….సిపిఎస్ ఉద్యోగులకు మాత్రం చెక్ పోస్ట్ లు పెడుతున్నారు.
• ఎన్నికల ముందు ప్రత్యేక హోదా అన్నారు, పోలవరం, అమరావతి పూర్తి చేస్తాం అన్నారు.
• మద్య పాన నిషేదం చేస్తేనే ఓటు అడుగుతాం అన్నారు….కానీ 25 మద్యం అమ్మకాలపై అప్పులు తెచ్చారు.
• దేశంలో దళితులు, గిరిజనులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయి.
• రాష్ట్రంలో ఆడబిడ్డలపై 31 శాతం దాడులు పెరిగాయి. ఈ విషయాలు నేషనల్ క్రైం బ్యూరో చెపుతున్న నివేదిక.
• ప్రజల జీవన ప్రమాణాలు పెరగలేదు కానీ…వైసిపి ఆదాయం మాత్రం భారీగా పెరిగింది.
• జగన్ ఈ మూడేళ్లలో 2 లక్షల కోట్లు అక్రమంగా ఆర్జించారు.
• లేపాక్షిలో భూములు కొట్టేశారు. 20 కోట్లు ఆదాయం లేని కంపెనీతో 500 కోట్లు పెట్టి వేల కోట్ల భూములుకొట్టేశారు.
• సొంత కంపెనీకి మైనింగ్ ఇచ్చారని హేమంత్ సోరెన్ సభ్యత్వం రద్దుపై ప్రతిపాదనలు చేశారు. సరస్వతీ భూముల విషయంలో జగన్ చేసిన దానికి ఏమి చెయ్యాలి.
• రాష్ట్రంలో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారు. కొవ్వూరు అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో గెలిచిన పానెల్ ను జగన్ రద్దు చేశారు. హైకోర్టు చీవాట్లు పెట్టి మళ్లీ వారికే అధికారం ఇచ్చింది.
• సంస్థాగత విషయాల్లో రాజీ పడేది లేదు….సభ్యత్వ నమోదు పూర్తి చెయ్యాలి.
• పార్టీ కి సంబంధించి గ్రామ స్థాయి వరకు కమిటీలు పూర్తి చెయ్యాలి.
• ఓటర్లు వెరిఫికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మన ఓట్లు ఉండవు. ప్రజల్లో ఎంత చైతన్యం ఉన్నా మన ఓట్లు లేకపోతే ఏమీ చెయ్యలేం. జాగ్రత్తగా ఉండాలి.
• గ్రాడ్యుయేట్ ఎన్నికల విషయంలో పార్టీ నేతలు బాధ్యత తీసుకోవాలి
• రాష్ట్రంలో ఇంత అరాచకం ఉంటే కొన్ని టీవీలు తిరిగి మనల్నే విమర్శిస్తున్నాయి.
• అందుకే నీలిమీడియా గా ఉన్న టివి9, ఎన్టీవిని దూరంగా పెట్టాలి… వారికి బాధ్యత గుర్తు చెయ్యాలి.
• నేతలు సొంత సోషల్ మీడియాను ఏర్పాటు చేసుకోవాలి. విస్తృతంగా ఉపయోగించుకోవాలి.
• దుర్మార్గుల చేతిలో టెక్నాలజీ ఉంటే మరింత ఎక్కువ నష్టం. మనం అప్రమత్తంగా ఉండాలి.
• రాష్ట్రంలో ఇంట్లోంచి టిడిపి నేతలు భయటకు వస్తే కేసులు పెడుతున్నారు.
• జగన్ కు నిద్రలో కూడా టిడిపి నేతలే గుర్తుకు వస్తున్నారు.
• పోలీసులు లేకుండా వైసిపి వాళ్లు వస్తే….ఒక్క నిముషంలో వారి పని తేలిపోతుంది. ఇది మన సవాల్.
• నేతలు తమ సౌకర్యం కోసం ఇంట్లో పడుకుంటే….ఎన్నికల అనంతరం కూడా ఇంట్లో ఉండాల్సి వస్తుంది.
• కేసులు, దాడులపై న్యాయ పరంగా, రాజకీయంగా పోరాడుతాం. ఎవరిని వదలం.
• ఇప్పటికీ నాపై కేసులు పెట్టేందుకు వెతుకుతున్నాడు. మన పేరు చెప్పమని కేసులు పెట్టి బాధితులను ఒత్తిడి చేస్తున్నాడు.
• జగన్ అక్రమాలకు అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. అవినీతి బుదర మనకూ అంటించే ప్రయత్నం చేస్తున్నాడు.
• ఎన్నికలకు 18 నెలల సమయం ఉంది. జగన్ ఇంకా ముందు ఎన్నికలకు వెళితే రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోతుంది.
• ఇప్పుడు ఎక్కడా పొత్తుల గురించి నేను మాట్లాడడం లేదు. పార్టీలో కూడా ఈ విషయంలో క్లారిటీ ఉండాలి.
• ముందు రాష్ట్రాన్ని కాపాడాలి.. దానికి అందరూ కలిసి రావాలి. మేథావులు, ఉద్యోగులు సహా అందరూ కలిసి రావాలి.
• నియోజకవర్గ ఇంచార్జ్ 10 రోజులు నియోజకవర్గంలో ఉండాలి. నియోజకవర్గ అబ్జర్వర్ 8 రోజులు నియోజకవర్గంలో ఉండాలి.
• భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులుగా ఉంటారు. వారిని గెలిపించే బాధ్యత పార్టీ నేతలు తీసుకోవాలి.
• రాష్ట్రంలో తెలుగు దేశం అధికారంలోకి వస్తేనే రాష్ట్ర పునర్నిర్మాణం సాధ్యం.
• అప్పట్లో ఎక్కువ సమయం పార్టీకి పెట్టలేదు కాబట్టి సమస్యలు వచ్చాయి.
• పార్టీపై దృష్టిపెట్టిన సందర్భంలో మనకు ఓటమి లేదు.
• పాలనలో నేను పడిపోయినప్పుడే సమస్యలు వచ్చాయి. నేను సైతం నన్ను సరి చేసుకుంటున్నాను.
క్విట్ జగన్…. సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదం అమల్లోకి తేవాలి.