LIVE FM सुनें

ADS 2020

LIVE CALANDER

July 2022
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
2nd July 2022

Anantapur Live News

www.anantapurlivenews.com

తల్లీ పిర్యాదు మేరకు ఏఫ్ఐఆర్ నమోదు చేయండి..డి హెచ్ పీ ఎస్ డిమాండ్…!

1 min read

దళిత సుబ్రమణ్యం మృతిపై
తల్లీ పిర్యాదు మేరకు ఏఫ్ఐఆర్ కట్టి ఎమ్మెల్సీను అరెస్ట్ తో పాటు ఎస్సీ&ఎస్టీ అట్రాసిటీకేసునమోదు చెయ్యాలి.డి హెచ్ పి ఎస్ డిమాండ్‌
ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ కారుడ్రైవరు,దళితయువకుడు సుబ్రమణ్యం,అనుమానాస్పదంగా మరణించినట్లు వచ్చిన వార్తలు తీవ్ర దిగ్భ్రాంతిని కలుగజేస్తున్నాయి. రోడ్డు ప్రమాదంలో మరణించాడని ఎమ్మెల్సీ చెప్పడం,స్వయంగా ఎమ్మెల్సీనే మృతదేహాన్ని తన వాహనంలో తీసుకురావడం, అసలు రోడ్డు ప్రమాదమే జరగలేదని పోలీసులు ప్రకటించడం మొదలగు వార్తలు అనేక అనుమానాలకు, సందేహాలకు తావిస్తున్నాయి. కుటుంబ సభ్యులు కూడా మరణం పట్ల అనేక సందేహాలు వ్యక్తంచేస్తున్నారు.ఈ నేపథ్యంలో తల్లీ పిర్యాదు మేరకు సుబ్రమణ్యం మృతికి కారణమైన అనంతబాబుపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని,ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను బయటకు తీయాలని డి హెచ్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం ఆర్ హనుమంతు డిమాండ్‌ చేశారు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరురు మృతుడి కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం రెండు ఎకరాల భూమి, భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు,
సుబ్రమణ్యం కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నరు.
కార్యక్రమంలో,సి.పి ఎం మండల కార్యదర్శి కె ఏ రామంజి నేయులు,ఎక్స్ ఎంపిటిసి టి గంగాధరప్ప,టి డి పి ఎస్సీ సెల్ మడకశిర పట్టణ అధ్యక్షుడు వై బి నాగరాజ్, ఎం ఎస్ ఎఫ్ నాయకులు రవి కుమార్,శివ,కుమార్,తదితరులు పాల్గొన్నారు.

  1. MALL